AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ MLAలను, నాయకులను ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జయకృష్ణ, లోకం నాగ మాధవి కాశీబుగ్గకు చేరుకుని పరిస్థితులను సమీక్షించనున్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.