కియా
ఇండియా తన పాపులర్ ఎస్యూవీ సెల్టోస్ లైనప్ను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా GTX(O), X-Line(O) అనే టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 21.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిలో ADAS Level 2 F+ సూట్, 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు, కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్పిట్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ సపోర్ట్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే (HUD) వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.