యూపీలోని లక్నోలో జరిగిన వరకట్న వేధింపుల ఘటన సంచలనంగా మారింది. వివాహం తర్వాత భర్తకు కిడ్నీ దానం చేయాలని, రూ. 30 లక్షలు ఇవ్వాలని అత్తమామలు బాధితురాలిపై ఒత్తిడి తెచ్చారు. పెళ్లి సమయంలో రూ. 8 లక్షలు, కారు ఇచ్చినప్పటికీ వారి దాహం తీరలేదని బాధితురాలు వాపోయింది. భర్తకు మద్యపానం వల్ల కిడ్నీ సమస్య ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేశారని ఆమె ఆరోపించింది. అత్త బెడ్రూమ్లో పడుకోవడం, మామ అనుమతి లేకుండా ఫోటోలు తీయడం వంటి వికృత చేష్టలు కూడా చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.