ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో నాయకులు కార్ల ర్యాలీగా అమలాపురం బయలుదేరారు. మహిళల పట్ల జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, తమ నిరసన గళాన్ని బలంగా వినిపించేందుకు ఈ మహా నిరసన ప్రదర్శన జరుగుతుందని రాజేశ్వరి తెలిపారు. ఈ నిరసనలో భాగంగా అమలాపురం గడియారం స్తంభం వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు.