అయినవిల్లి మండలం వెలువలపల్లిలో శనివారం కొబ్బరి కొట్టులో రెండు ప్రమాదకర రక్తపింజరి పాములు కలకలం సృష్టించాయి. మూటలు తీస్తున్న సమయంలో బయటపడిన ఈ పాములను భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ వర్మ చాకచక్యంగా బంధించారు. ఇటీవల కాలంలో రక్తపింజరి పాముల సంచారం పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్మ సూచించారు.