శనివారం అయినవిల్లి మండలం అయినవిల్లి సిద్ధివినాయక స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు లఘున్యాస అభిషేకాలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యసన, అన్నప్రాసనలు, నూతన వాహన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,19,052 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.