కోనసీమ, పి. గన్నవరం మండలం బెల్లంపూడిలో ఆదివారం మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి తన కుటుంబంతో కలిసి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో పాల్గొన్నారు. అధికారులు, బీఎల్ఓలకు అవసరమైన పత్రాలు అందజేస్తూ, ఓటర్లంతా తమ వివరాలు, కలర్ ఫోటోతో కూడిన ఫారాలను ఈ నెల 14 లోపు సమర్పించాలని ఆమె కోరారు. సందేహాలుంటే సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. బెల్లంపూడిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.