నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం గ్రామంలో శుక్రవారం పశు ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో గేదెలు, ఆవులకు వివిధ పరీక్షలు చేసి చికిత్సలు అందించారు. పాడి రంగంలో అభివృద్ధికి పశువుల ఆరోగ్యం కీలకమని సర్పంచ్ రాజులపాటి ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.