తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఒక భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి రహదారి పక్కకు ఒరిగిపోయింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ లారీ గౌరీపట్నం సమీపంలో వేగ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్కు సహాయం అందించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.