అన్న క్యాంటీన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల భోజనం

8చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం, దేవరపల్లి ప్రాంతంలో పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్‌లో భోజనం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ సేవలను పెద్ద సంఖ్యలో వినియోగించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పేదలు, కార్మికులు, ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సేవలను నిర్వహిస్తోందని, రాజకీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం అన్న క్యాంటీన్‌ల ఉపయోగకరతకు నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్