కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ గురువారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,369, గ్రేడ్-ఏ రకానికి రూ. 2,389 చొప్పున ధర నిర్ణయించారు.