జెఎన్టీయూ కాకినాడలో 12వ స్నాతకోత్సవం గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ చాన్సలర్ హోదాలో హాజరవుతారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ స్నాతకోత్సవాన్ని డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పట్టాలు అందజేయనున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.