కొవ్వూరులో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని, క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆళ్ల హరిబాబు, నాదెళ్ల శ్రీరామ్, చిటికిన చిన్న పెంటారావు, రామకృష్ణ కూడా పాల్గొన్నారు.