మండపేట మండలం కేశవరం మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు చోడే కృష్ణమూర్తి తన సొంత నిధులతో రూ. 12 వేలు ఖర్చు చేసి నాణ్యమైన స్టీల్ వాటర్ బాటిళ్లను బహూకరించారు. మంగళవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో గ్రామ నాయకులు కంటిపూడి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఈ బాటిళ్లను అందజేశారు. వేసవిలో పిల్లల ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరమని గుర్తించి, అడ్మిషన్లు పెరిగిన ఉత్సాహంతో హెచ్ఎం చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని రాంబాబు, ఉపాధ్యాయులు, ఎస్. ఎం. సి సభ్యులు, తల్లిదండ్రులు కొనియాడారు.