శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. శనివారం మండపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం తగదని ఆయన హెచ్చరించారు.