కాట్రేనికోనలో వైసీపీ నాయకులు, బీఎల్వోలతో ఓటర్ల జాబితా సవరణపై సోమవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొన్నాడ సతీశ్ కుమార్ అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు వల్లే ఎన్నికల ఫలితాలు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల ఓటు హక్కును సంరక్షించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.