పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టౌన్లో జరిగిన జనసేన పార్టీ ఇన్చార్జి ఎన్నికల్లో మామిడాల సూరిబాబు 93 ఓట్లకు గాను 90 ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. సూరిబాబు జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఫలితం గొల్లప్రోలు టౌన్లో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని అందిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.