ఘనంగా రాయవరంలో పొలంబడి, ఇండిగ్యాప్ కార్యక్రమం

రాయవరంలో గురువారం జరిగిన పొలంబడి కార్యక్రమంలో జిల్లా జేడీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురుగుమందులు, కలుపు మందులు, ఎరువుల అవశేషాలు లేని ఉత్పత్తులను పండించడం ద్వారా రైతులు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పొందవచ్చని తెలిపారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ రుసుమును వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై పొందవచ్చని, దీనికోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
