లోక కళ్యాణం కోసం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కోటి తులసి పూజ చేయనున్నట్లు ఈవో త్రినాధరావు తెలిపారు. పాడి పంటలు బాగుండాలని దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆదివారం మీడియాకు వెల్లడించారు. వైదిక కమిటీ సూచనలతో ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పూజ ద్వారా ప్రజలందరి సంక్షేమం కోరబడుతుంది.