రాజమండ్రిలోని జీజీహెచ్ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా డా. కె. ఎ. వి. సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ పాతూరి రవిశంకర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.