రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తన కార్యకర్తలకు న్యాయం చేయని వ్యక్తి అని మాజీ ట్రేడ్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు మృతి చెంది తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో కనీసం పరామర్శించకుండా కార్యక్రమాలకు సొమ్ములు ఇవ్వాలని భరత్ కోరారని ఆరోపించారు. ఈ సంఘటన భరత్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ప్రవీణ్ చౌదరి పేర్కొన్నారు.