రాజమండ్రిలోని
బీజేపీ కార్యాలయంలో ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించి, పోలీస్ సమస్యలతో పాటు వ్యక్తిగత, ఆరోగ్య, విద్యుత్, భూ సమస్యలు, గ్రామ అభివృద్ధి పనులపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా
బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనత వారధి కన్వీనర్ శివరామరాజు, కో కన్వీనర్ యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.