గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాభిప్రాయ నిర్మాణం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ – ప్రజల మధ్య అనుసంధానంగా మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా పనిచేస్తుందని ఆయన అన్నారు.