రాజమండ్రిలోని కన్నమాంబ పేరంటాల ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధికి నూతన పాలకమండలి సభ్యులు కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.