తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, రాగోలపల్లి గ్రామాల్లో బుధవారం గాలిదుమ్ముతో కూడిన వర్షం కురిసింది. ఉదయం తీవ్రమైన వడగాల్పులు వీచినప్పటికీ, మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.