కోరుకొండ భూముల సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు

12చూసినవారు
కోరుకొండ భూముల సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కోరుకొండ ఈనాం భూముల సమస్య పరిష్కారంలో సరికొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. గురువారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మొదటి విడతగా 138 ఎకరాల భూములకు నిషేధిత జాబితా సెక్షన్ 22A నుండి విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ భూ సమస్యలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

సంబంధిత పోస్ట్