రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో వైసీపీ కార్యకర్తల 'ఆత్మీయ సమావేశం' రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పద్మరాజు రుద్రరాజు పర్యవేక్షణలో, మండల అధ్యక్షులు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన, గ్రామ అధ్యక్షులు కోన ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరిదేవి, వైసీపీ CEC సభ్యులు KSN రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల హాజరై కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.