కాకినాడ, తునిలోని రాజా క్రీడా మైదానంలో మంగళవారం అండర్ 17 బాలురు, బాలికల జిల్లా స్థాయి
క్రికెట్ జట్ల ఎంపిక జరిగింది. ఈ పోటీల్లో 200 మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి జిల్లా జట్లలో స్థానం సంపాదించారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 8, 9 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అసోసియేషన్ అధ్యక్షుడు గంట విక్టర్ బాబు, కలిదండి సత్యనారాయణ రాజుతో పాటు పలువురు ప్రముఖులు క్రీడాకారులను అభినందించారు.