
కృష్ణా జిల్లాలోకి వెళ్లిపోనున్న కైకలూరు నియోజకవర్గం!
ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి మారనుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఈ మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో ఏలూరు డివిజన్ పరిధిలోని కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాలు గుడివాడ రెవెన్యూ డివిజన్ కిందకు రానున్నాయి. ఈ మార్పునకు సంబంధించిన వివరాలను మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది.



































