గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక సహకార సంఘంలో స్టాప్ అసిస్టెంట్ గా పనిచేసి మంగళవారం పదవి విరమణ చేయనున్న రాయల నాగేశ్వరరావును శిరిడి సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. సొసైటీ కౌంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు నాగళ్ళ మురళి, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, సీఈఓనామా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.