అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, నాగాయలంక, చల్లపల్లి, కోడూరు మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది.