తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాలకు చెందిన పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆయన తనయుడు యువనేత సింహాద్రి వికాస్ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితిని జగన్ కు వివరించారు.