ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ఘంటసాల ఎస్ఐ వేమన చందన యువతకు సూచించారు. సోమవారం ఘంటసాల గ్రామ యువతతో ఆమె సమావేశం నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంపై అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధమైన గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కలిగే పరిణామాలను ఆమె వివరించారు.