ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్ధికమంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన కొణిజేటి రోశయ్య జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. చల్లపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీపురం సెంటరులో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహావిష్కరణ ఆదివారం జరిగింది. రోశయ్య విగ్రహాన్ని రామసత్యనారాయణ ఆవిష్కరించారు. సభలో ఆయన మాట్లాడుతూ రోశయ్య వివాదరహితుడని కొనియాడారు.