చల్లపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం చల్లపల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ షాపులను తనిఖీలు నిర్వహించి ఆయా షాపులలో మత్తు పదార్థాలు అమ్మకాలు చేపడుతున్నది లేనిది పరిశీలించారు. అంతేకాకుండా ఎవరైనా షాపులలో మత్తు పదార్థాలు అమ్మకాలు చేపట్టిన యెడల వారిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.