ఘంటసాల మండలంలో తుఫాన్ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఉదయం మబ్బులు రావడంతో వరి పంట వేసిన రైతులు భయపడ్డారు. యంత్రాలతో వరి కోసిన రైతులు, తేమ శాతం అధికంగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పలుచోట్ల మబ్బులతో కూడిన ఈదురు గాలులు వీయడంతో చలి తీవ్రత కూడా పెరిగింది.