ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన తోపుల హంసిక ఫణి దేవి 585 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తోపుల నాగబాబు కుమార్తె అయిన హంసిక సాధించిన ఈ ఘనత పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది.