శనివారం ఉదయం ఘంటసాల-రామానగరం మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. చల్లపల్లి నుంచి ఘంటసాల వస్తున్న కారును పుచ్చగడ్డ దాటిన తర్వాత యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం, బైక్ కూడా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడికి గాయాలయ్యాయి.