నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పెనుమూడి సాయిబాబు శుక్రవారం బిఎల్ఓల సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి లోపు ఓటర్ వెరిఫికేషన్ నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో సరిపోల్చి వెరిఫికేషన్ చేశారా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 44 పోలింగ్ స్టేషన్ల బిఎల్ఓలను సమీక్షించి, ఇంకా ఎంతమందిని వెరిఫై చేయాలో ఆయన అడిగి తెలుసుకున్నారు.