కోడూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సోమవారం పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా వాతావరణం మారి వర్షం పడటంతో దివిసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. వరి కోత పోసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, రహదారుల పక్కన ధాన్యం రాశులు పోశారని ఆయన పేర్కొన్నారు.