ఎండ తీవ్రత కారణంగా కోడూరులో బడే వెంకటేశ్వరరావు (62) అనే వృద్ధుడు మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద కుప్పకూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.