కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ
వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీలో
వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మెరుగుమాల కాళీ పాల్గొన్నారు.