బుధవారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఏలూరు జిల్లా కైకలూరు మండలం, కైకలూరు గ్రామానికి చెందిన మానుపాటి శ్రీదేవి (50) అనే భక్తురాలు ఆలయం వద్ద ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆలయంలో నిద్రించిన ఆమె, ఉదయాన్నే మృతి చెందడం భక్తులలో కలకలం రేపింది.