ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా ఆలయానికి రూ. 9, 82, 581 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.