మోపిదేవి జాతీయ రహదారి నుండి కొక్కిలిగడ్డ వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన బిటి రహదారి అక్రమ మట్టి రవాణా వల్ల ధ్వంసమవుతోంది. కోడూరు, అవనిగడ్డ మండలాల నుండి సరిహద్దులు దాటి మోపిదేవికి తరలిస్తున్న మట్టి ట్రాక్టర్ల వల్ల దశాబ్దాల కల అయిన రహదారి నాశనమవుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.