బ్లెండ్ టీ-20 క్రికెట్ ప్లేయర్, కెప్టెన్ దీపిక బెంగళూరు నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో శాప్ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఫైనల్స్ వరకు జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ఆమె విశేష కృషి చేశారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరారు. బుధవారం ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు.