గన్నవరంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇంటర్నేషనల్ ‘టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్’ లెవల్-2 పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. వి. శివరామ్, పి. ధరణి ప్రథమ బహుమతులు సాధించగా, జహస్వా, అబ్దుల్ ద్వితీయ, ఆదర్స్ బాబు తృతీయ బహుమతులు అందుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజేతలకు అభినందనలు తెలిపారు.