సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆదివారం నగరవాసులు పల్లె బాట పట్టడంతో చెన్నై - కోల్ కత్తా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి జీరో పాయింట్, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ మేర బారులు తీరాయి. రోజువారీ వాహనాల కంటే దాదాపు 30 వేల వాహనాలు అధికంగా టోల్ ప్లాజా దాటుతున్నాయని అంచనా. పెరుగుతున్న రద్దీని నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.