కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లను నిర్బంధంగా అమలు చేయదలచిన తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మల్లంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈనెల 20న జరగబోయే సమ్మెలో ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని అల్లాపురంలో కూలీలతో గురువారం మాట్లాడారు.