గుడివాడ ప్రజా వేదికలో ఆదివారం బీసీ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల హారిక, రాము దంపతులు రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. శనివారం పోలీసులను నమ్మించి మళ్లీ గొడవకు వచ్చారని ఆరోపించారు. ఏడాదిగా కొడాలి నాని రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఈ దంపతులు అనవసరంగా మీటింగ్లు పెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.